Nellore District: ఉరేసుకొని భార్య ఆత్మహత్య, రైలు కిందపడి భర్త సూసైడ్

Nellore District:  ఉరేసుకొని భార్య ఆత్మహత్య,   రైలు కిందపడి భర్త సూసైడ్
X
నెల్లూరులో విషాదం

నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాద ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ర్త మ‌ద్యానికి బానిసై కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, అప్పులు పాల‌వ్వ‌డంతో తీవ్ర‌ మ‌న‌స్తాప‌న‌కు గురైన భార్య ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో త‌న వ‌ల్లే త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చ‌లించిపోయి భ‌ర్త కూడా రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో అభంశుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులు అనాథుల‌య్యారు.

పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్‌నగర్‌లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.

స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్‌, టైల్స్‌ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది.

అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్‌ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు.

ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్‌ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్‌ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Next Story