Crime News: అక్రమ సంబంధం గురించి అడిగిన పాపానికి..

Crime News: అక్రమ సంబంధం గురించి అడిగిన పాపానికి..
Crime News: ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేశాడు. హతురాలి బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: చేసేవి చెత్త పనులు.. అయినా వాటిని ప్రశ్నించకూడదు.. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అతడి బుద్ది గడ్డితింది.. అదేమని అడిగినందుకు ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీరంగపట్టణం తాలూకా గండేహొసహళ్లికి చెందిన రవిగౌడకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. భర్త మరొక యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి భార్య యోగిత (27) అతడిని నిలదీసింది. పిల్లల ఎదురుగానే తీవ్రంగా గొడవపడ్డారు.. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రవి ఆమెను గదిలోకి ఈడ్చుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేశాడు. హతురాలి బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story