Karnataka: బెదిరించి పెళ్లి చేసుకున్నాడు.. రోజూ వేధిస్తూ చివరికి..

Karnataka: బెదిరించి పెళ్లి చేసుకున్నాడు.. రోజూ వేధిస్తూ చివరికి..
Karnataka: పెళ్లయిన రోజు నుండి హిజాజ్ తనను వేధిస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చింది అపూర్వ.

Karnataka: శారీరికంగా, మానసికంగా భార్యలను వేధించే భర్తల గురించి రోజుకు ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం. అలాంటి ఎంతోమంది శిక్షలు కూడా అనుభవిస్తు్న్నారు. అయినా ఇలా వేధిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా కర్ణాటకలో కూడా ఇలాంటి ఓ ఘటనే వెలుగుచూసింది. ఇష్టపడి పెళ్లి చేసుకొని, తనకు నచ్చినట్టు నడుచుకునే భార్యనే హత్య చేయాలని చూశాడు ఓ భర్త.

కర్ణాటకలోని గదగ్‌కు చెందిన అపూర్వ పురాణిక్‌ తాను కాలేజీలో చదువుకుంటున్న సమయంలో హిజాజ్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. అయితే ఓ రోజు శారీరికంగా అపూర్వను వేధించిన హిజాజ్ అదంతా వీడియో తీశాడు. అదంతా తన తల్లిదండ్రులకు చూపిస్తానని చెప్పి 2018లో బలవంతంగా అపూర్వను పెళ్లి చేసుకున్నాడు హిజాజ్. పెళ్లయిన తర్వాత వీరిద్దరు విజయపురలో స్థిరపడ్డారు.

పెళ్లయిన రోజు నుండి హిజాజ్ తనను వేధిస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చింది అపూర్వ. వివాహం జరిగిన తర్వాత తనను మత మార్పిడి చేసుకోమని బలవంత పెట్టాడట. అలా చేసుకున్న తర్వాత నుండి తనకు రోజూ మాంసం వండిపెట్టమంటూ వేధించేవాడట. అలాగే తనకు, తన కుమారుడికి కూడా మాంసం అలవాటు చేశాడట హిజాజ్. అంతే కాకుండా తనను హిప్నటైజ్‌ కూడా చేసేవాడని పోలీసులకు తెలిపింది అపూర్వ.

కొన్నాళ్లకు హిజాజ్‌కు ముందే పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని అపూర్వకు తెలిసింది. దీంతో తాను తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఈ నెల 12న మాట్లాడడానికి రమ్మని అపూర్వను పిలిచాడట హిజాజ్. అక్కడికి వెళ్లిన తనను మచ్చుకత్తితో 23 సార్లు నరికాడని పోలీసులకు తెలిపింది అపూర్వ. హిజాజ్ నుండి తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని, తనను కాపాడమని పోలీసులను వేడుకుంది అపూర్వ.

Tags

Read MoreRead Less
Next Story