Hyd : రాజేంద్రనగర్ లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. 200 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు. ఎమ్ఎమ్ పహాడీ లోని గృహ నివాసాల మద్య ఓ పరిశ్రమ లో నకిలీ అల్లంవెల్లులి పేస్టు తయారీ కి తెరలేపిన తెలిపారు. ప్రమాదకరమైన రసాయనాలతో అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నారని అన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో acetic acid వాడుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MM pahadi దాడులు నిర్వహించిన ఎస్వోటీ బృందం.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న సోహెల్ ను అదుపులోకి తీసుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com