hyderabad: క్షమించండి.. తప్పు చేశాను: సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య

hyderabad: క్షమించండి.. తప్పు చేశాను: సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య
hyderabad: బాలానగర్‌లోని తన ఇంట్లో సోమవారం రాత్రి 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

hyderabad: బాలానగర్‌లోని తన ఇంట్లో సోమవారం రాత్రి 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సాయికుమార్ తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి బాలానగర్ పాత గ్రామంలో నివసిస్తున్నాడు. "సోమవారం ఉదయం, సాయి కుమార్ తల్లి అతడిని మందలించింది.

తమ్ముడు ఫోన్ కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బులను సాయి కుమార్ ఖర్చు పెట్టేశాడు.. దాంతో తల్లి అతడిని అరిచింది. దీంతో చిన్న బుచ్చుకున్న సాయికుమార్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గదిలో అలికిడి లేకపోయేసరికి అమ్మానాన్నకు అనుమానం వచ్చి తలుపులు పగుల గొట్టి చూడగా సాయికుమార్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు.

గత కొంత కాలం నుంచి కొడుకు డిప్రెషన్ లో ఉన్నాడని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. గదిలో కనిపించిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story