Hyderabad : ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీల చోరీ..ఇద్దరు అరెస్ట్

X
By - Vijayanand |21 Feb 2023 5:15 PM IST
రూ.5లక్షల విలువైన 26పెద్ద బ్యాటరీలు, 48 చిన్న బ్యాటరీల స్వాదీనం
హైదరాబాద్ లోని పలు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడంలేదంటే ఏమో అనుకునేవాళ్లం. బహుషా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడంలేదేమోనని జనాలు అనుమానపడేవారు. అయితే అదేం లేదట. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగతనం చేయడం వలనే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. దీంతో వలపన్ని ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు అబిడ్స్ పోలీసులు. వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన 26పెద్ద బ్యాటరీలను, 48 చిన్న బ్యాటరీలను స్వాదీనం చేసుకున్నారు.
ఈ దొంగలపై చైతన్యపురి పోలీస్టేషన్ లో 11కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు షేక్ అజీముద్దీన్, జంగల మద్దిలేటిలపై కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించారుపోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com