Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టివేత

X
By - Vijayanand |23 Feb 2023 12:50 PM IST
సూడాన్ నుండి షార్జామీదుగా హైదరాబాద్ వచ్చిన 23 మంది ప్రయాణికులు నుండి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గోల్డ్ను తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీన్నారు. సూడాన్ నుండి షార్జామీదుగా హైదరాబాద్ వచ్చిన 23 మంది ప్రయాణికులు నుండి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com