Delhi: ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్.. మరో 22 మంది..

Delhi: ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్.. మరో 22 మంది..
Delhi: ఢిల్లీ డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆదిత్య రెడ్డిని NCB అరెస్ట్ చేసింది.

Delhi: ఢిల్లీ డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆదిత్య రెడ్డిని NCB అరెస్ట్ చేసింది. దేశ రాజధానిలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న 22 మందిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. వీరిలో సైకియాట్రిస్ట్‌ ఆదిత్య రెడ్డి కూడా ఉన్నారు. మానసిక రోగులపై డ్రగ్స్‌ ప్రయోగిస్తున్నట్టు ఎన్‌సీబీ విచారణలో తేలడంతో ఆదిత్య రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఓన్లీ లవ్‌ పేరుతో డ్రగ్స్‌ అమ్ముతున్న ఆదిత్య రెడ్డి.. LSD, MDMA డ్రగ్స్‌కు బానిస అయ్యాడని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు. ఆదిత్య రెడ్డి డ్రగ్స్‌ విక్రయాలపై నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story