అమ్మకి మెసేజ్ చేసి.. అంతలోనే ప్రాణం విడిచి..

అమ్మకి మెసేజ్ చేసి.. అంతలోనే ప్రాణం విడిచి..
పదో తరగతి చదువుతున్న అమ్మకి మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

పదో తరగతి చదువుతున్న అమ్మకి మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాయదుర్గం మై హోం భూజా అపార్ట్ మెంట్స్ లో బాలుడి కుటుంబం నివసిస్తోంది. తండ్రి ముంబైలో ఫైనాన్స్ అనలిస్ట్ గా పని చేస్తుంటారు. ఇద్దరు కుమారులు, భార్యతో కలిసి హై హోం భూజాలో నివసిస్తున్నారు. పదోతరగతి చదువుతున్న పెద్ద కుమారుడు సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బయటకు వెళుతున్నానని తల్లికి చెప్పి వెళ్లి పోయాడు.

వ్యక్తిగత కారణాలు, మానసిక ఒత్తిడితో తాను చనిపోతున్నట్లు తల్లికి మెసేజ్ పంపించాడు. దీంతో ఆందోళన చెందిన తల్లి అతడి కోసం వెతకడం ప్రారంభించింది. ముంబైలో ఉంటున్న భర్తకు సమాచారం అందించడంతో అతడు హుటాహుటిన బయలు దేరి ఆ రాత్రే ఫ్లైట్ లో ఇంటికి చేరుకున్నారు. అర్థరాత్రి వరకు బాలుడి జాడ తెలియక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్ మెంట్ లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బాలుడు రాత్రి 7.15 గంటలకు హెచ్ బ్లాక్ నుంచి జే బ్లాక్ లోకి వచ్చి లిప్ట్ లో పైకి వెళ్లినట్లు కనిపించింది. పైకి వెళ్లి చూసినా ఫలితం లేదు. మంగళవారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందితో కలిసి పోలీసులు వెతుకుతుండగా జే బ్లాక్ మెట్ల డక్ట్ వద్ద రక్తపు మడుగులో బాలుడు పడి ఉండడం గమనించారు. 35 అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story