Hyderabad : గోడెక్కిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం..

Hyderabad : హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్రహరీని ఢీకొట్టి సగం ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ ఆగింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కారులో చిక్కుకున్న మహిళను కాపడారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజ్ భవన్ రహదారిలోని మాజీ ఎంపీ జి.వివేక్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వైపు వెళుతుంది. ఆ మార్గం పల్లంగా ఉండడమే కాకుండా ఎడమవైపు మలుపు ఉండడంతో ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి కారు ప్రహరీని ఢీకొట్టింది. 15 అడుగుల ఎత్తులో వాహనం ముందు భాగం గాలిలో వేలాడింది.
స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు వాహనం నడుపుతున్న మహిళ ఊపిరి పీల్చుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com