Karnataka : ప్రయాణికుడి ఛాతిపై కాలితో తన్నిన కండక్టర్..

Karnataka : ప్రయాణికుడి ఛాతిపై కాలితో తన్నిన కండక్టర్..
Karnataka : కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్ కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు

Karnataka : కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్ కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బస్సు ఎక్కాడాని ప్రయాణికుడితో కండక్టర్ గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా ప్రయాణికుడి గొడుగును బయటకు విసిరేశాడు. అనంతరం అతనిబ ఛాతీపై కాలితో తన్ని.. బలవంతంగా బయటకు నెట్టేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా పూత్తూరు సమీపంలోని ఈశ్వరమంగళలో జరిగింది.

బస్సు దిగాలని చెబుతూ.. కండక్టర్ ప్రయాణికుడిపై చేయితో దాడి చేశాడు. కండక్టర్‌ తన్నడంతో ప్రయాణికుడు రోడ్డుపై పడిపోయాడు. అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కండక్టర్‌ తీరుపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో బస్‌ కండక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన బస్ కండక్టర్ సుబ్బరాజ్ రాయ్‌గా గుర్తించారు. అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రయాణికులు పరిస్థితి స్థితిలో ఉన్నా... చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఏ కండక్టర్‌కు లేదు. కండక్టర్‌ చేసింది తప్పేనని.... అందుకే అతడిని వెంటనే సర్వీసు నుంచి సస్పెండ్ చేశామని పుత్తూరు కేఎస్‌ ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ జయకర శెట్టి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story