Karnataka : పసిబిడ్డపై లైంగిక దాడి.. ఆ పై హత్య

Karnataka : పసిబిడ్డపై లైంగిక దాడి.. ఆ పై హత్య
నిందితుడు తల్లికి తెలిసిన వ్యక్తి. మంగళవారం బాధితురాలి తల్లి బయటకు వెళ్లినప్పుడు నిందితుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు


మూడున్నరేళ్ల బాలికను లైంగికంగా వేధించి, హ్యత చేశాడో వ్యక్తి. ఈ ఘటన బెంగళూరులోని కావేరీపురలో మంగళవారం జరిగింది. బాధితురాలి తల్లి, తన కూతురుతో కలిసి కావేరిపురలో నివసిస్తోంది. నిందితుడు తల్లికి తెలిసిన వ్యక్తి. మంగళవారం బాధితురాలి తల్లి బయటకు వెళ్లినప్పుడు నిందితుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఆమె వచ్చేసరికి చిన్నారి సృహతప్పి పడిపోయి ఉంది. అక్కడే ఉన్న నిందితున్ని బాధితురాలి తల్లి ప్రశ్నించగా కొట్టడం వల్లే సృహతప్పినట్లు చెప్పి అక్కడి నుంచి నిందితుడు జారుకున్నాడు.

చిన్నారిని హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. చనిపోక ముందు చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. నిందితుడిని కామాక్షిపాళ్య పోలీసులు పట్టుకున్నారు. విచారించగా.. లైంగికదాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడుపై పోలీసులు పోస్కో చట్టం కింద అభియోగాలు మోపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2020 - 21కి గాను భారతదేశంలో పిల్లలపై నేరాలు 16.2శాతం పెరిగాయి. దక్షిణ భారతదేశంలో అధికంగా 7,261 వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ, కేరళ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story