Hyderabad: ఆరాంఘర్ చౌరస్తాలో ప్రమాదం.. బస్సు టైర్ కింద పడి చిన్నారి మృతి..
Hyderabad: రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కొత్తూరు పరిధి ఇన్ముల్ నర్వాకు చెందిన వారీగా గుర్తించారు. బస్సు ఎక్కేందుకని రోడ్డు దాటుతున్న క్రమంలో వీరిని గమనించని.. డ్రైవర్ అలాగే ముందుకు పోనివ్వడంతో ప్రమాదం జరిగింది. బస్సు ముందు టైర్ కింద పడిన చిన్నారి నజియా బేగం.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె అమ్మమ్మ నజ్రియా బేగం సైతం తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com