Kinnaur Landslide : హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి..!

X
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కిన్నౌర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం కూడా హిమాచల్ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 11 మంది చనిపోయారు, 14 మంది గాయపడ్డారు. మరో 30 మంది ఆచూకీ కోసం ఇంకా గాలింపు జరుపుతున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
