Kurnool : కర్నూలు జిల్లాలో సీఐ చేతివాటం.. పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు వసూలు

Kurnool : కర్నూలు జిల్లాలో సీఐ చేతివాటం.. పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు వసూలు
Kurnool : కర్నూలులో ఓ సీఐ తన పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు నొక్కేశాడు. విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Kurnool : కర్నూలులో ఓ సీఐ తన పై అధికారి పేరు చెప్పి 15 లక్షలు నొక్కేశాడు. విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ నెల 19న పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర 75 లక్షల రూపాలను SEB అధికారులు పట్టుకున్నారు. ఐతే డబ్బుకు తగిన ఆధారాలు ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టేందుకు సీఐ 15 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైనా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న సీఐ విజయవాడకు పరారైనట్లు తెలుస్తోంది. సీఐని పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో కూడా SEB అధికారులు డబ్బులు పట్టుకున్న ఘటనలో ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story