Anantapur : జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మహిళలు మృతి

Anantapur : జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మహిళలు మృతి
Anantapur : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Anantapuram : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. జనాలపై దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మహిళలను బలితీసుకుంది. ఈ ఘటన కళ్యాణదుర్గం - అనంతపురం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. పెన్నా నదిలో జల ప్రవాహాన్ని చూసేందుకు.. బెలుగుప్ప మండలం కాల్వపల్లికి చెందిన సరస్వతి, లక్ష్మీదేవి బ్రిడ్జిపై నిలుచున్నారు. ఆ సమయంలో దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో వారు నుజ్జునుజ్జయ్యారు.

వంతెన ఇరుకుగా ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.

Tags

Next Story