CRIME: ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. ఉయ్యూరుకు చెందిన మాధవరాజు (30), మాధవి(28) ప్రేమించుకున్నారు. మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే, గత రాత్రి మాధవి వాళ్ల ఇంటికి వెళ్లిన రాజు ఆమె కుటుంబ సభ్యులతో ఇద్దరికి పెళ్లి చేయమని కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మాధవి ఇంటి వరండాలోనే అతడు ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందాడు. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, మాధవరాజు మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. అయితే, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com