అనురాధ మృతి కేసులో కీలక అంశాలు..

మలక్పేట అనురాధ మృతి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి.అనురాధ మృతి కేసును రాచకొండ పోలీసులకు బదిలీ చేశారు. 15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రమోహన్ తో ఆమెకు గతకొన్నాళ్లుగా విభేదాలు నెలకొన్నాయి. దీని కారణంగా అనురాధ మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు కూడా వేయించింది. అంతేకాదు తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్ ను డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలని వత్తిడి చేసింది. దీంతో ఆమెను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన పని లేదని చంద్రమోహన్ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. పథకం ప్రకారమే అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి హత్య చేశాడు. ఒకరోజు పాటు మృతదేహాన్ని బయటే ఉంచాడు. మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తరువాత అనురాధ మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్లో దాచి పెట్టాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. యూట్యూబ్లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. వాసన రాకుండా కెమికల్స్ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో అనురాధను చంపితే బంధువులెవరూ రారని గుర్తించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించి అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేశాడు. అనురాధ సెల్ఫోన్ను చార్ధామ్కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని పథకం పన్నాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com