Ghaziabad: మైనర్ బాలికతో ప్రేమ.. కొట్టి చంపిన ఫ్యామిలీ

మైనర్ బాలికతో ప్రేమవ్యవహారం నడిపిన వ్యక్తిని కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. పర్వేజ్ (23) అనే యువకుడు గజియాబాద్ లోని ఖోడా అనే ప్రాంతంలో నివసిస్తోన్న అతని ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో వెళ్లాడు. పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఇనుపరాడ్లతో కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పర్వేజ్ తమ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని బాలిక తండ్రి పోలీసులకు చెప్పారు.
బాలిక ఫోన్ ను, పర్వేజ్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు గుర్తించగా అసలు విషయం బయటపడింది. పర్వేజ్ విషయం బాలిక కుటుంబ సభ్యులు ముందుగానే తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు. అంతలోనే బాలిక ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో పర్వేజ్ వెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిపై రాడ్లతో దాడి చేశారని చెప్పారు. బాలిక తండ్రితోపాటు ఇద్దరు బంధువులను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. పర్వేజ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com