Nellore: కాలేజీ గదిలో అబార్షన్.. బీటెక్ విద్యార్థిని మృతి

Nellore: కాలేజీ గదిలో అబార్షన్.. బీటెక్ విద్యార్థిని మృతి
Nellore: తల్లిదండ్రులకు, ఊరికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహం పేరుతో ఎవరెవరితోనో పరిచయాలు..

Nellore: తల్లిదండ్రులకు, ఊరికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహం పేరుతో ఎవరెవరితోనో పరిచయాలు.. అందర్నీ నమ్మేస్తుంటారు.. వారి ఆంతర్యం గురించి ఆలోచన చేయరు. ముందు మాటలు, ఆ తరువాత మనసులు కలుస్తాయి.. ప్రతి మాట తియ్యగానే కనిపిస్తుంది. ఆలోచనా శక్తిని కోల్పోయి అన్నిటికీ ఓకే చేసేస్తారు.. ఆ తరువాత లబోదిబో మన్నా ఉపయోగం ఉండదు.. ఈ వ్యవహారం మొత్తంలో ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే.. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఓ సంఘటన ఓ ఆడపిల్ల జీవితం ముగింపుకు కారణమైంది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్ధినికి తరగతి గదిలోనే అబార్షన్ కావడంతో మృతి చెందింది.

మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 11న కళాశాల విద్యార్ధులందరూ ఆవరణలో ఉండి కబుర్లాడుకుంటూ ఉంటే ఆ విద్యార్ధిని మాత్రం క్లాసు రూములో ఉండి గదికి గడియపెట్టుకుంది.

ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా తరగతి గదిలోనే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. పక్కనే ఆరు నెలల పిండం ఉంది. ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెను పిండంతో సహా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తల్లి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమెకు తరగతి గదిలోనే అబార్షన్ అయిందా లేక యూట్యూబ్ చూసి తనకు తానే అబార్షన్ చేసుకుందా అనే కోణంలో విచారిస్తున్నారు. యువతి సెల్ ఫోన్ ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవర్‌తో పరిచయాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కూలంకషంగా చర్చించి విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story