Hyderabad : మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. నగల కోసం పూజారే హత్య చేశాడు

Hyderabad :  మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్..  నగల కోసం పూజారే హత్య చేశాడు
Hyderabad : హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మహిళ ఒంటిమీద నగల కోసం పూజారి హత్యచేసినట్లు వెల్లడైంది.

Hyderabad : హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మహిళ ఒంటిమీద నగల కోసం పూజారి హత్యచేసినట్లు వెల్లడైంది. నిత్యం తాను పూజించే ఆలయ గర్భగుడి ముందే..మహిళ తలపై పూజారి రాడ్డుతో కొట్టి ప్రాణాలు తీయటం విస్మయ పర్చిచింది. మహిళ మృతదేహాన్ని గుళ్లోనే డ్రమ్ములో మూడురోజలపాటు దాచిపెట్టి.. నిర్భీతిగా పూజలు చేశాడు. దుర్వాసన వస్తుండడంతో శవాన్ని అక్కణ్నుంచి తరలించి సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద చెట్ల పొదల్లో పడేశాడు.

విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీకి చెందిన ఉమాదేవి నిత్యం శివపురి కాలనీలోని వినాయక ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తుండేది.ఈనెల 18న గుడికి వెళ్లిన ఉమాదేవి..తిరిగి ఇంటికి రాలేదు. మహిళ కోసం కుటుంబ సభ్యులు అన్నిచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆలయ పూజారిని వాకాబు చేయగా గుడికి వచ్చివెళ్లినట్లు తెలిపాడు. అయితే అప్పటికే గుడిని శుభ్రం చేసి తాళాలు వేసి ఉండటంపై ప్రశ్నించగా... పిల్లి చనిపోతే శుభ్రం చేసి తాళాలు వేసినట్లు పూజారి చెప్పినట్లు మృతురాలి స్నేహితులు పేర్కొన్నారు.

మహిళ మర్డర్‌ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈనెల 19, 20 తేదీల్లో ఆలయ పరిసరాల్లో కనిపించని మహిళా మృతదేహం... గురువారం గుడి వెనకే లభ్యం కావటంతో ఆలయ అర్చకుడు మురళిని అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా మిస్టరీ వీడింది.

ఒంగోలుకు చెందిన పూజారి మురళీకృష్ణ కొన్నేళ్లుగా మల్కాజిగిరిలో స్థిరపడ్డాడు. తొలుత విష్ణుపురిలోని ఆలయంలో పూజారిగా పనిచేశాడు. అనంతరం విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలోని సిద్ధివినాయక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇటీవలికాలంలో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులపాలైన మురళీకృష్ణ.. వాటినుంచి బయటపడే మార్గంలో రోజూ గుడికి వచ్చే ఉమాదేవి నగలపై కన్నుపడింది.

మహిళ బంగారాన్ని కాజేయాలనే ఉద్దేశంతో...ఈనెల 18న గుడికి వచ్చిన ఉమాదేవి గర్భగుడి ముందు నిలబడి దేవుడికి దణ్నం పెట్టుకుంటుండగా వెనుక వైపు నుంచి ఆమె తలపై బలంగా ఇనప రాడ్డుతో కొట్టాడు. ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడం, పూజారి ముందస్తు ప్రణాళికతో ఆమె ఒంటిపై నగలు కాజేశాడు. వీటిని నగల దుకాణం వ్యాపారికి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story