16 హత్యలు : సైకో కిల్లర్ అరెస్ట్!
ఏకంగా 16 మంది మహిళలను హత్య చేసిన సైకో కిల్లర్ రాములును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేశారు.

ఏకంగా 16 మంది మహిళలను హత్య చేసిన సైకో కిల్లర్ రాములును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం.. పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాకి వెల్లడించారు.
చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న రాములు తన భార్యతో విడిపోవడంతో మానసికంగా దెబ్బ తిన్నాడు. దీనితో మహిళల పైన కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. ముందుగా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపైన కేసు నమోదైంది. ఆ తర్వాత తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి.
అయితే 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలై మరో రెండు హత్యలకి పాల్పడ్డాడు. నిందితుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
RELATED STORIES
Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMTNalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMT