Pune Crime: ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య.. జీవితంలో ఓడిపోయానంటూ తండ్రికి లేఖ

Pune Crime: ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య.. జీవితంలో ఓడిపోయానంటూ తండ్రికి లేఖ
X
పూణే టెక్కీ ఆఫీస్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి భవనంలోని బాల్కనీ నుంచి దూకి మరణించాడు. నేను జీవితంలో ప్రతిచోటా విఫలమయ్యాను అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

పూణే టెక్కీ ఆఫీస్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి భవనంలోని బాల్కనీ నుంచి దూకి మరణించాడు. నేను జీవితంలో ప్రతిచోటా విఫలమయ్యాను అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

సంఘటనా స్థలంలో చేతితో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో, పియూష్ వ్యక్తిగత వైఫల్య భావనను వ్యక్తం చేశాడు.

పూణేలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఐటీ ఇంజనీర్ సోమవారం ఉదయం తన కార్యాలయ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని పియూష్ అశోక్ కవాడేగా గుర్తించారు, హింజెవాడి ఫేజ్ వన్‌లోని అట్లాస్ కాప్కోలో ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేస్తున్నాడు.

నాసిక్‌కు చెందిన పియూష్ ఆఫీస్ లో మీటింగ్ కు హాజరయ్యేందుకు సిద్దమయ్యాడు. కానీ అంతలోని ఛాతీ నొప్పి ఉందని తన తోటి సహోద్యోగులకు చెబుతూ టెర్రస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో సహోద్యోగులు, సిబ్బందిని షాక్‌కు గురిచేసింది. "ఛాతీలో నొప్పి ఉందని చెబుతూ అతను సమావేశం మధ్యలోనే వెళ్లిపోయాడు. మరి కొన్ని నిమిషాల తర్వాత ఏడవ అంతస్తు నుండి దూకాడు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సంఘటనా స్థలంలో చేతితో రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్‌లో, పియూష్ తీవ్ర విచారం మరియు వ్యక్తిగత వైఫల్య భావనను వ్యక్తం చేశాడు. "నేను జీవితంలో ప్రతిచోటా విఫలమయ్యాను. నన్ను క్షమించు" అని అతను తన తండ్రికి ఒక సందేశం రాశాడు, తాను కొడుకుగా ఉండటానికి అర్హుడు కాదని భావిస్తున్నానని, తన చర్యలకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పాడు. భావోద్వేగంతో కూడిన నోట్‌లో, ఆత్మహత్యకు ఎటువంటి పనికి సంబంధించిన ఒత్తిడి లేదా వృత్తిపరమైన సమస్యలు కారణమని పేర్కొనలేదు. ఈ విషాద సంఘటన హింజెవాడి ఐటీ కారిడార్‌లో అలజడి సృష్టించింది

Tags

Next Story