rajapalli: 20 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోట్రాలీని ఢీకొన్న లారీ

X
By - Prasanna |26 Oct 2021 5:55 PM IST
rajapalli: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది.
rajapalli: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణీకులతో ఉన్న ఆటోట్రాలీని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోట్రాలీలోని 10 మందికి గాయాలయ్యాయి వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీరియస్గా ఉన్న మరో నలుగురిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులు ఇందిరానగర్ వాసులుగా గుర్తించారు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎమ్మెల్యే బాలరాజు ఆస్పత్రికి తరలివచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించేందుకు సాయం చేశారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com