Ranga Reddy : రంగారెడ్డిలో గన్తో దోపిడీ దొంగల హల్చల్..

X
By - Divya Reddy |23 Aug 2022 9:01 AM IST
Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు.
Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. మధుబన్ కాలనీలోని ఓ జువెల్లరీ షాపులోకి ప్రవేశించిన ముగ్గురు దుండగులు... దోపిడీకి యత్నించారు. షాపు యజమాని నగలు చూపిస్తున్న సమయంలో గన్ తీసి అతన్ని బెదిరించారు. అప్రమత్తమైన షాపు యజమాని... స్థానికుల సహాయంతో ఇద్దరు దుండగులను పట్టుకుని చితకబాదారు. మరొకరు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇద్దరు దుండగులను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

