Crime News: కొడుకే కాలయముడు.. పక్కా ప్లాన్‌తో తండ్రిని..

Crime News: కొడుకే కాలయముడు.. పక్కా ప్లాన్‌తో తండ్రిని..
X
Crime News: మానవ సంబంధాలన్నీ మంటగలిసి పోతున్నాయి. డబ్బే పరమావధిగా బతుకుతున్నారు..

Crime News: మానవ సంబంధాలన్నీ మంటగలిసి పోతున్నాయి. డబ్బే పరమావధిగా బతుకుతున్నారు.. తండ్రిని హతమారిస్తే అతడి దగ్గర ఉన్న డబ్బంతా తనకే దక్కుతుందనుకున్నాడు. ఫేస్‌బుక్‌లో కిల్లర్ కోసం వెతికాడు. అతడితో లక్షరూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు.

మధ్యప్రదేశ్ శివపురి సమీపంలోని పిచ్చోరే పట్టణంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసించే మహేష్ గుప్తాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కొడుకు అంకిత్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఏ పనీ చేయకుండా డబ్బు కోసం తండ్రిని ఇబ్బంది పెడుతుండేవాడు.. ఆయనకు వచ్చిన పెన్షన్ డబ్బులే కుటుంబం గడవడానికి ఆధారం.

ఇటీవల అన్న చనిపోవడంతో కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. అవి కూడా తన దగ్గరే పెట్టుకున్నాడని తండ్రి మీద కోపంతో ఉన్నాడు అంకిత్. కొడుకు డబ్బులు ఇవ్వడం కట్టడి చేశాడు తండ్రి. దాంతో ఎలాగైనా తండ్రిని హత మారిస్తే ఆ డబ్బంతే తనకే వస్తుందని ప్లాన్ చేశాడు.

ఫేస్‌బుక్‌లో వెతికి బిహార్‌కు చెందిన అజిత్ సింగ్ అనే కిల్లర్‌ను సంప్రదించాడు. మిత్రుడు నితిన్ లోధితో కలిసి తండ్రిని చంపేందుకు కుట్ర పన్నారు. పథకం ప్రకారం అర్థరాత్రి కిల్లర్ అజిత్ వచ్చి తండ్రిని హత్య చేసేందుకు నిర్ణయించారు.

భార్యా పిల్లలను పక్క గదిలో పడుకోమని చెప్పి తండ్రి నిద్రిస్తున్న గదిలోకి అజిత్‌ని తీసుకుని వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో హత్య చేశాడు. ఆ శబ్ధానికి భార్య లేచి వచ్చినా ఎక్కడో పిడుగు పడింది అని చెప్పి పంపించేశాడు. తెల్లారాక లేచి తన తండ్రిని ఎవరో చంపేశారని చుట్టుపక్కల అందరికీ చెప్పాడు.

అనుమానం వచ్చిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అంకిత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే తండ్రిని హత్య చేయించానని డబ్బు కోసం ఇదంతా చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నితిన్, అజిత్‌ను అరెస్ట్ చేశారు.

Tags

Next Story