ఐఏఎస్ కావాలనుకుంది.. అంతలోనే ఆత్మహత్య

రంగారెడ్డిజిల్లా షాద్నగర్ కు చెందిన ఐశ్యర్య అనే విద్యార్ధిని ఆత్మహత్య పాల్పడింది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఐశ్యర్య ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోంది. ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించిన ఐశ్యర్య అర్ధాంతరంగా తనువుచాలించింది. కోవిడ్ కారణంగా యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించడంతో షాద్నగర్కు వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సూసైడ్ చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువును కొనసాగించలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసింది. తన తండ్రి బైక్ మెకానిక్ కావడం, తన చదువు కుటుంబానికి భారం కాకూడదనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు అర్ధమవుతోంది. చదువుల్లో రాణిస్తున్న తనకూతురు అర్ధాంతరంగా తనువుచాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com