Hyderabad: ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడు, మార్ఫింగ్ ఫొటోలతో యువతి వేధింపులు

Hyderabad: ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడు, మార్ఫింగ్ ఫొటోలతో యువతి వేధింపులు
కటకటాలపాలైన యువతి

తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్ష గట్టింది ఒక యువతి . అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేదింపులకు గురి చేసింది. కుటుంబం సభ్యుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విషయం పోలీసులను చేరడంతో ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి (24) గ్రూప్-1 శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి విషయాన్ని అతడికి చెప్పింది.

ఆమె చెప్పింది విన్న అతడు షాకయ్యాడు. తనకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఆమెను మందలించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆమె.. అతడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరవడంతోపాటు యూట్యూబ్‌ చానెల్ ప్రారంభించింది. వాటిలో అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి పెట్టింది. అక్కడితో ఆగకుండా అధ్యాపకుడు పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్‌తోపాటు హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో వాటిని షేర్ చేస్తూ వేధించడం మొదలుపెట్టింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి అనంతపురంలో ఉన్న నిందితురాలిని గురువారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

Tags

Read MoreRead Less
Next Story