గద్వాల జిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
By - Subba Reddy |5 Jun 2023 12:15 PM GMT
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఈ ఘటన పల్లెపాడు పరిధిలో చోటుచేసుకుంది. వివాహ వేడుక కోసం మానవపాడు మండలం బోరువెల్లికి వచ్చారు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన బంధువులు. అయితే వీరు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారి క్షేమంగా బయటపడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com