TS : కట్టుకున్న భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు

TS : కట్టుకున్న భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు
15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నవ్య గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి

కన్న బిడ్డలు వద్దని తిరుగబడుతున్నా కట్టుకున్న భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతకుడు. 15 రోజులపాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది ఆ ఇల్లాలు. ఈ హృదయ విధారక ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్ ప్రాంతానికి చెందిన నవ్యశ్రీ, తిరునగరి నరేంద్ర భార్యా భర్తలు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే గత నెల 18న ఇంటివద్ద భార్యపై భర్త నరేంద్ర శానిటైజర్ పోసి నిప్పంటించాడు. వద్దని ఓ వైపు కన్న బిడ్డలు వారిస్తున్నా పెడచెవిన పెట్టాడు. తమ కళ్ళ ముందే మంటల్లో తల్లి విలవిలలాడుతూ కాలిపోతుంటే పిల్లలు అల్లాడిపోయారు. స్థానికుల సహాయంతో నవ్యను ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నవ్య గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story