Uttar Pradesh: డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు మృతి 16 మందికి గాయాలు

Uttar Pradesh: డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు మృతి 16 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లోని టోలి గ్రామ సమీపంలో డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని ఠాణా సికంద్రరావుకు చెందిన టోలి గ్రామ సమీపంలో డబుల్ డెక్కర్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారని డీఎం హత్రాస్ ఆశిష్ కుమార్ తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది, ఫలితంగా ఇద్దరు మరణించారు, 16 మంది గాయపడ్డారని కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న హత్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నిపున్ అగర్వాల్, పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణనష్టంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రుల సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.



Tags

Next Story