Visakha : మద్యం మత్తులో వాచ్ మెన్ వీరంగం.. పోలీసులపై దాడి
విశాఖలో మద్యం మత్తులో ఓ అపార్ట్ మెంట్ వాచ్మెన్ వీరంగం సృష్టించాడు. వాచ్మెన్గా పనిచేస్తున్న గోపి మద్యం తాగి అపార్ట్మెంట్ లో గలాటా చేయడంతో అపార్ట్మెంట్ వాసులు డయల్ 100 కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు పోలీసులు కృష్ణ, కిషోర్లు అపార్ట్మెంటుకు వెళ్లారు. వాచ్ మెన్ గోపిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చెలరేగింది.
ఇంట్లో ఉన్న సుత్తి తీసుకొని కానిస్టేబుళ్ల వెంటపడ్డాడు. దీంతో పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులంకించుకున్నారు. పోలీసులను అపార్ట్మెంట్ చుట్టూ పరిగెత్తిస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించిన వాచ్ మెన్ గోపి స్కూటీపై వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ పోలీసులను కాల్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వాచ్మెన్ చేతిలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com