Crime : 'మహాఇల్లాలు'.. భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియుడితో చెక్కేసింది..

Crime : మహాఇల్లాలు.. భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియుడితో చెక్కేసింది..
Crime : ఏవిటో.. రాను రాను సమాజం ఇలా తయారవుతోంది. ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లయ్యాక భర్తతో గొడవపడి ప్రియుడితో పారిపోయిందంటే.. ప్రేమ అంత పని చేయించిందని సరిపెట్టుకోవాల్సి వచ్చేది.

Crime: ఏవిటో.. రాను రాను సమాజం ఇలా తయారవుతోంది. ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లయ్యాక భర్తతో గొడవపడి ప్రియుడితో పారిపోయిందంటే.. ప్రేమ అంత పని చేయించిందని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఇక్కడ పెళ్లై ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా ప్రేమ దోమ అంటూ ప్రియుడితో పారిపోయింది ఓ మహా ఇల్లాలు. పైగా ఆ దుబాయ్ ప్రియుడితో చక్కర్లు కొడుతూ అక్కడి నుంచి పిల్లలకు ఫోన్ చేసి తాను అక్కడ చాలా హాపీగా ఉన్నానని చెబుతుండేది. దీంతో కలత చెందిన భర్త నాలుగేళ్లు భరించి నా వల్ల కాదంటూ ముగ్గురు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

తుముకూరులోని పిహెచ్ కాలనీలో సమీవుల్లా భార్య సాహెరా బాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెరాబాను ప్రియుడితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సమీవుల్లా ఒక్కడే ముగ్గురు పిల్లలను పోషిస్తూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్ నుంచి పిల్లలను వీడియో కాల్ చేస్తూ హేళనగా మాట్లాడేది.

ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగు మందు తాగించి తాను కూడా తాగేశాడు. దాంతో కొంతసేపటికే సమీవుల్లా చనిపోగా, పిల్లలు మాత్రం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు పిల్లలను హుటాహుటిన బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితీ ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story