Crime News: రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో..

Crime News: రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో..
Crime News: కామంతో కళ్లు మూసుకుపోతున్నారు.. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు కొందరు దుర్మార్గులు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కదులుతున్న రైల్లో నుంచి తోసేసాడు.

Crime News: కామంతో కళ్లు మూసుకుపోతున్నారు.. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు కొందరు దుర్మార్గులు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కదులుతున్న రైల్లో నుంచి తోసేసాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదఘటన హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

తనపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వ్యక్తితో పోరాడినందుకు 30 ఏళ్ల మహిళను కదులుతున్న రైలులోంచి బయటకు నెట్టి చంపిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు.

ఫతేబాద్‌లోని తోహానా పట్టణంలోని స్టేషన్‌లోకి రైలు ఆగినప్పుడు, రైలులో ఒంటరిగా ఏడుస్తున్న కొడుకుని తండ్రి చూసి అమ్మ ఏది.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దాంతో తండ్రికి రైల్లో జరిగిన సంఘటన వివరించాడు పిల్లవాడు.

ముగ్గురు ప్రయాణికులు మినహా కోచ్ మొత్తం ఖాళీగా ఉంది. కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను చూసిన నిందితులు ఆమెను అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ఎదురు తిరిగింది. ఆ వ్యక్తి మహిళను రైలు నుంచి బయటకు తోసి తానూ దూకేశాడు.

20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు భర్త మొబైల్‌కు కాల్ చేసి, తీసుకెళ్లడానికి స్టేషన్‌కు రావాలని కోరింది. దాంతో అతడు స్టేషన్‌కు చేరుకున్నాడు.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

పోలీసులు నిందితుడిని సందీప్ (27)గా గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే, పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహం కోసం రైల్వే ట్రాక్ వెంబడి అర్ధరాత్రి వరకు గాలించగా శుక్రవారం దొరికింది.

Tags

Read MoreRead Less
Next Story