సవతి పిల్లల్ని దారుణంగా హత్య చేసి.. తరువాత

ఓ మహిళ తన సవతి పిల్లల్ని దారుణంగా హత్య చేసి.. తాను ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన నల్గొండలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. పట్టణానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో శాంతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రదీప్కు, అతని మొదటి భార్య ప్రసన్నరాణికి ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయి. దీంతో మొదటి భార్య.. కుటుంబంపై కక్ష పెంచుకుంది. ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని హత్య చేసి, తర్వాత అదే ఇంట్లో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రసన్నరాణి.
రెండో పెళ్లి చేసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్తపై ప్రసన్నరాణి కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన ప్రదీప్.. 20 ఏళ్ల క్రితం నల్గొండకు వచ్చి స్థిరపడ్డాడు. దుప్పెల్లికి చెందిన ప్రసన్నరాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత ప్రదీప్ శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు.
మొదటి భార్య ప్రసన్నరాణి ప్రదీప్తో రాజీకి వచ్చింది. నెల రోజుల క్రితం అందరూ ఒక్కటై కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, తన భర్త.. రెండో భార్యతోనే ఎక్కువగా గడుపుతుండడాన్ని ప్రసన్నరాణి సహించలేకపోయేది. భర్త, తన సవతి పిల్లలపై కసి పెంచుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లల ఉసురు తీసింది.
RELATED STORIES
Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు..
17 Aug 2022 1:00 AM GMTGold and Silver Rates Today: స్థిరంగా బంగారం వెండి ధరలు..
16 Aug 2022 1:04 AM GMTApple iPhone 11: యాపిల్ ఐఫోన్.. ఫ్లిఫ్ కార్ట్లో భారీ ఆఫర్
15 Aug 2022 10:15 AM GMTRakesh Jhunjhunwala: స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్వాలా...
14 Aug 2022 8:45 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం.. స్వల్పంగా వెండి...
13 Aug 2022 1:06 AM GMTMS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
11 Aug 2022 11:43 AM GMT