నేను వారిని నమ్ముకున్నా: కీరవాణి

నేను వారిని నమ్ముకున్నా: కీరవాణి
గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కీరవాణి అన్నారు.

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును సొంతం చేసుకుని 'ఆర్ఆర్‌ఆర్‌' చరిత్ర సృష్టించింది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొని 'నాటు నాటు' పాటకు ఈ అవార్డును దక్కించుకుంది. ఇవాళ కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో అతిథుల హర్షధ్వానాల మధ్య సంగీత దర్శకుడు కీరవాణి అంగోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కీరవాణి అన్నారు.దుకున్నారు. రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కుటుంబం కూడా ఈ ఉత్సవంలో పాల్గొంది. అవార్డు తీసుకున్న తరవాత కీరవాణి మాట్లాడుతూ.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంతోష సమయాన్ని సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిజానికి నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలని అన్నారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాననని కీరవాణి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story