Covid: వేగంగా మహమ్మారి..ఒక్కరోజులోనే పదివేల కేసులు

Covid: వేగంగా మహమ్మారి..ఒక్కరోజులోనే పదివేల కేసులు
గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 10వేల 542 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులో మళ్లీ పెరిగాయి. ఒక్క రోజులోనే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవర పెడుతుంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 10వేల 542 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేలు దాటిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయన్నారు.

మూడు రోజులుగా కరోనా కొత్త కేసులు పదివేల లోపే నమోదయ్యాయి. ఆదివారానికి గడిచిన 24 గంటల్లో 7వేల 633 మంది వైరస్ బారిన పడగా.. సోమవారం 9వేల 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గుతోందని అధికారులు భావించారు. అయితే, ఇవాళ మరోసారి కేసులు 10 వేలు దాటడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు తెలంగాణలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story