Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. 37 మంది పిల్లలతో సహా 43 మంది నీట మునిగి..
'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా, మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. నదులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలోనే 37 మంది పిల్లలతో సహా మొత్తం 43 మంది మునిగిపోయారని, మరో ముగ్గురు అదృశ్యమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది.
బుధవారం జరిగిన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. "ఇప్పటి వరకు మొత్తం 43 మృతదేహాలను వెలికితీశారు. తదుపరి శోధన ఆపరేషన్ కొనసాగుతోంది" అని విపత్తు నిర్వహణ విభాగం (DMD) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని ప్రకటనలో తెలిపారు.
“తూర్పు మరియు పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com