Chhattisgarh: సుక్మా ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: సుక్మా ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి
X
సుక్మా జిల్లాలో, అరణ్యాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు కనీసం 10 మంది మావోయిస్టులను హతమార్చాయి.

సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు కనీసం 10 మంది మావోయిస్టులను హతమార్చాయి. జిల్లాలోని కొరాజుగూడ, దంతేవాడ, నాగారం, భండరపదర్ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) బృందం మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది ఆపరేషన్‌లో భాగమయ్యారని బస్తర్ రేంజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పి తెలిపారు.

ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి బలగాలకు నిఘా సమాచారం అందిందని, మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదని ఐజీ తెలిపారు. ఈ బృందాలు INSAS రైఫిల్స్, AK-47 రైఫిల్స్ మరియు SLR రైఫిల్స్‌తో సహా అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "టీమ్ ఇంకా అడవిలో ఉన్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని ఐజి తెలిపారు.

గురువారం ఒడిశాలోని మలకన్‌గిరి జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఫలితంగా ఒక మావోయిస్టు మరణించాడు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం దేశ రాజధానిలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

Tags

Next Story