మొదటి రోజే అసెంబ్లీలో స్పీకర్ విజేంద్ర గుప్తా, అతిషి మధ్య ఘర్షణ..

మొదటి రోజే అసెంబ్లీలో స్పీకర్ విజేంద్ర గుప్తా, అతిషి మధ్య ఘర్షణ..
X
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు అతిషి స్పీకర్ విజేందర్ గుప్తాను అభినందించారు.

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కార్యకలాపాలు గందరగోళంగా జరిగాయి. విజయేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఆయన పేరును ప్రతిపాదించారు. అంతకుముందు, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ సింగ్ లవ్లీ చేత ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు అతిషి స్పీకర్ విజేందర్ గుప్తాను అభినందించారు. అతిషి మాట్లాడుతూ, మీరు అధ్యక్షుడైనందుకు చాలా అభినందనలు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి భగత్ సింగ్, అంబేద్కర్ చిత్రాలను తొలగించడం హర్షణీయం కాదు. ఇది బిజెపి దళిత, సిక్కు, జాతి వ్యతిరేక మనస్తత్వాన్ని చూపిస్తుంది అని అన్నారు. దాంతో అతిషి వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది.

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి ఎమ్మెల్యేల మధ్య చర్చ ప్రారంభమైంది. అతిషి సభలోని స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని విజేంద్ర గుప్తా అన్నారు. గొడవ తగ్గకపోవడాన్ని గమనించిన విజేంద్ర గుప్తా అతిషిని కూర్చోమని అడిగారు. అతిషి ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అసెంబ్లీ స్పీకర్ అన్నారు. ఆమె ఎటువంటి కారణం లేకుండా వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల ఈ రకమైన వైఖరిని సభ సహించదు అని స్పీకర్ అన్నారు.

ప్రతిపక్షాలు సభను సజావుగా జరగనివ్వడం లేదని నేను భావిస్తున్నానని గుప్తా అన్నారు. ప్రతిపక్షాలు సభా నియమాలను, చట్టాలను ఉల్లంఘించి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తే, దానిని సహించబోమని హెచ్చరిస్తున్నాను. ఈ ప్రవర్తన ఖండించదగినది అని ఆయన అన్నారు.

మీరు సభ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని స్పీకర్ గుప్తా అన్నారు. ఈ అరాచకవాద వ్యక్తులకు నేను చెప్పాలనుకుంటున్నాను, వారి ప్రవర్తనను మెరుగుపరచుకోవాలని. మొదటి రోజే సభ కార్యకలాపాలకు ఇలా అంతరాయం కలుగుతోంది. సభ గౌరవం దెబ్బతింటోంది. ప్రజలు తమ స్థానాల్లో కూర్చుని సభ గౌరవప్రదంగా పనిచేయడానికి అనుమతించమని నేను అభ్యర్థిస్తున్నాను అని

Tags

Next Story