ఇంజనీరింగ్ విద్యార్థి 'అమరన్' మేకర్స్కి లీగల్ నోటీసు.. కోటి పరిహారం డిమాండ్

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ అమరన్ నిర్మాతలకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి లీగల్ నోటీసు పంపాడు. చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వివి వగీశన్ తన ఫోన్ నంబర్ను సినిమాలో ఉపయోగించారని అది ఇప్పుడు తనకు నిద్ర లేకుండా చేస్తుందని తెలిపాడు.
సినిమాలో సాయి పల్లవి నటించిన ఇందు తన ఫోన్ నంబర్ను రెబెక్కా వర్గీస్గా చూపుతోందని, సినిమా విడుదలైనప్పటి నుండి నిరంతరం కాల్స్ వస్తున్నాయని విద్యార్థి చెప్పాడు. తనకు నిద్ర పట్టడం లేదని, చదువుకోలేకపోతున్నానని, నిరంతర కాల్స్ వల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నానని వాగీశన్ నోటీసులో పేర్కొన్నాడు. ఇందుకు గాను అమరన్ మూవీ మేకర్స్ తనకు రూ. 1.1 కోట్ల పరిహారం ఇవ్వాలని వగీశన్ తరపు న్యాయవాది నోటీసులు పంపారు. వగీశన్ తన ఫోన్ నంబర్ మార్చుకోనని కూడా చెప్పాడు.
శివకార్తికాయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com