UK PM Rishi Sunak : బెంగళూరులో పర్యటించిన రిషి సునాక్​

UK PM Rishi Sunak : బెంగళూరులో పర్యటించిన రిషి సునాక్​

బ్రిటన్‌ మాజీ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బెంగళూరులో మెరిశారు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ కాఫీ షాప్‌లో సందడి చేశారు. స్థానికులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి ఇటీవలే బెంగళూరులోని థర్డ్‌ వేవ్‌ కాఫీ షాప్‌లో కాఫీ డేట్‌ను ఆస్వాదించారు. ఇద్దరూ టేబుల్‌ వద్ద కాఫీని ఎంజాయ్‌ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆ సమయంలో కాఫీ షాప్‌కు వెళ్లిన స్థానికులు రిషి సునాక్‌ జంటను చూసి థ్రిల్‌ అయ్యారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రిషి సునాక్ 2022 నుంచి 2024 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీ ఓటమి చవి చూసింది

Next Story