ముంబైలో భారీ వర్షాలు.. నలుగురు మృతి

ముంబైలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
X
ముంబైలో బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కొనసాగుతుండటంతో, అనేక లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

భారీ వర్షం కారణంగా ముంబై నీట మునిగింది. జన జీవనం అస్థవ్యస్థమైంది. రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా నలుగురు స్థానికులు మృతి చెందారు. వర్షాలు, వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. లోకల్ రైళ్లు వాటి ట్రాక్‌లలో నిలిచిపోయాయి. కనీసం 14 ఇన్‌కమింగ్ విమానాలను మళ్లించవలసి వచ్చింది. సెప్టెంబర్ 26, గురువారం ఉదయం 8:30 గంటల వరకు ముంబై మరియు దాని పరిసర జిల్లాలైన థానే, పాల్ఘర్ మరియు రాయ్‌గడ్‌లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ముంబైలో భారీ వర్షాల కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలందరూ వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ముంబై పోలీసులు సూచించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెప్టెంబర్ 25న రాత్రి 9:30 గంటలకు థానేలోని ముంబ్రా బైపాస్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో 3 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ముంబై విమానాశ్రయంలోకి వచ్చే దాదాపు 14 విమానాలను వేర్వేరు ప్రాంతాలకు మళ్లించారు. వర్షం కారణంగా పలు రైళ్లు కూడా నిలిచిపోవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

IMD ప్రకారం, సెప్టెంబరు 27 వరకు ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది.

Next Story