Hyderabad: అమెరికాకు పంపినందుకు ప్రియురాలి తండ్రిపై ఓ వ్యక్తి కాల్పులు..

తమ ప్రేమని అర్థం చేసుకోని ప్రియురాలి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి కాల్పులు జరిపాడు.
హైదరాబాద్లో తమ బంధాన్ని విడనాడి విదేశాలకు పంపిన ప్రియురాలి తండ్రిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. 25 ఏళ్ల బల్వీందర్వ్య గత కొన్నేళ్లుగా వ్యాపారవేత్త ఆనంద్ కుమార్తె (23)తో ఏళ్ల రిలేషన్షిప్లో ఉన్నాడు. తన కుమార్తెతో బల్వీందర్ను కలవవద్దని చాలాసార్లు హెచ్చరించాడు ఆనంద్. సంబంధాన్ని ముగించమని ఇరువురినీ కొోరాడు. అయినా వారు వినిపించుకోలేదు. తమ సంబంధాన్ని కొనసాగించారు.
అయినప్పటికీ, వారు ఒకరినొకరు కలవడం మానలేదు. ఫోన్ సంభాషణలు కూడా కొనసాగించారు. దాంతో ఆనంద్ పథకం ప్రకారం తన కూతురిని అమెరికా పంపించాడు. విషయం తెలుసుకున్న బల్వీందర్ ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె తండ్రి ఆనంద్తో గొడవ పడ్డాడు. కోపంతో బల్వీందర్ తన వద్ద ఉన్న ఎయిర్గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు.
ఆనంద్ కంటికి బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన బల్వీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com