మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సులు, రైళ్లు.. అత్యున్నత సౌకర్యాలను అందించనున్న IRCTC

మహాకుంభమేళా కోసం సన్నద్ధమవుతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. యాత్రీకులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు పెద్ద ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపధ్యంలో అహ్మదాబాద్ రైల్వే డివిజన్ యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి 34 కొత్త రైలు సేవలను ప్రారంభిస్తోంది. అహ్మదాబాద్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) అజయ్ సోలంకి మాట్లాడుతూ, ''పశ్చిమ రైల్వే 98 ప్రత్యేక రైలు సేవలను ప్రారంభిస్తోంది, వీటిలో 34 అహ్మదాబాద్ డివిజన్ ద్వారా రాజ్కోట్-బనారస్ మరియు సబర్మతి-బనారస్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ప్రారంభించబడుతోంది అని తెలిపారు.
ప్రయాణికుల భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం రైల్వే ప్రొటెక్షన్ టీమ్లను స్టేషన్లలో మోహరించారు. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభించినందున యాత్రికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోగలరు.
జనవరి 10 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు ప్రయాగ్రాజ్లో జరుపుకోనున్న భారీ మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రవాణా పరంగా, లక్షలాది మంది విచ్చేస్తారని భావిస్తోంది. ఇందుకోసం 5000 కంటే ఎక్కువ బస్సులు మరియు 550 ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వివేక్ చతుర్వేది ట్రాఫిక్ నిర్వహణ కోసం తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
యాత్రికుల కోసం ప్రత్యేక సేవలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC ) భక్తులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించేలా చూస్తోంది. 1 లక్ష మందికి పైగా ప్రయాణీకుల వసతి ఏర్పాట్లు చేస్తూ, సుమారు 3,000 ప్రత్యేక రైళ్లు నడపబడతాయని తెలిపింది. అంతేకాకుండా, త్రివేణి సంగమం సమీపంలో మహాకుంభ్ గ్రామ్ పేరుతో విలాసవంతమైన టెంట్ కూడా ఏర్పాటు చేయబడింది.
భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి మహాకుంభ్ ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుంది . ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ నేతృత్వంలో, ఈ కార్యక్రమంలో శక్తివంతమైన జానపద కళలు మరియు ప్రదర్శనలు కూడా ప్రదర్శించబడతాయి. ''షాహి స్నాన్'' అని పిలువబడే ప్రధాన స్నానపు ఉత్సవాలు జనవరి 14 (మకర సంక్రాంతి, జనవరి 29 (మౌని అమావాస్య) మరియు ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి) న జరుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com