Kashmir: ఉగ్రవాదుల దాడిలో మాజీ సైనికుడు మృతి.. గాయాలతో బయటపడ్డ భార్య, కుమార్తె

X
By - Prasanna |3 Feb 2025 4:44 PM IST
మంజూర్ అహ్మద్ వాగే మరియు అతని కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటన బెహిబాగ్ ప్రాంతంలో జరిగింది.
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మాజీ సైనికుడు మృతి చెందగా, అతని భార్య, కుమార్తె గాయపడ్డారు.
బెహిబాగ్ ప్రాంతంలోమంజూర్ అహ్మద్ వాగే మరియు అతని కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, వాగే ప్రాణాలు కోల్పోగా, అతని భార్య మరియు కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, పారామిలటరీ బలగాలు మరియు ఆర్మీ సంయుక్త బృందం వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దాడి చేసిన వారిని గుర్తించడానికి ఆర్మీ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com