మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్ పై దాడి

మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్ పై దాడి
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఓఆర్ఆర్ భూ బాధితులు

యాదాద్రి జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్‌ను ఓఆర్ఆర్ భూ బాధితులు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి జగదీష్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు సైడ్ గ్లాస్ పగిలింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం హెడ్ లైట్లు సైతం ధ్వంసమయ్యాయి. నిన్న కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags

Next Story