Nara Lokesh : అశేష జనవాహిని మధ్య యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ కర్నూలు నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. లోకేష్కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. లోకేష్తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీ పడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు.ఇక లోకేష్ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇవాళ 92వ రోజు పాదయాత్ర కర్నూలు నియోజకవర్గంలో జరగనుంది. టీజీ భరత్తో కలసి కర్నూలులో పాదయాత్ర చేయనున్నారు లోకేష్. ఇక సాయంత్రం కర్నూలు STBC గ్రౌండ్లో మైనార్టీ సోదరులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.పలు సామాజిక వర్గాలతో మమేకం అవుతున్న యువనేత వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. పార్టీ శ్రేణుల అభిమాన వర్షంలో లోకేశ్ తడిసి ముద్దయ్యారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ లోకేశ్ పాదయాత్రలో పాల్గొని అడుగులేశారు. పాదయాత్ర పొడవునా లోకేశ్ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వెతలను విన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసానిచ్చారు. ప్రజల నుంచి స్వాగతాలు అందుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com