మియాపూర్‌లో కాల్పుల ఘటనలో కీలక విషయాలు

మియాపూర్‌లో కాల్పుల ఘటనలో కీలక విషయాలు

హైదరాబాద్‌ మియాపూర్‌లో కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయి వ్యవహారంలోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్‌ రెస్టారెంట్లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ బీహార్‌కు చెందిన అమ్మాయిని హౌజ్ కీపింగ్ ఇన్‌చార్జ్‌గా నియమించాడు. దేవేందర్ పై రిత్విక్ కాల్పులకు పాల్పడ్డాడు. కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిత్విక్‌కు ఆ అమ్మాయికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఇదే హోటల్‌లో రెండో మేనేజర్‌గా పనిచేసిన రిత్విక్‌ను ఇటీవలే యాజమాన్యం తొలగించింది.

Tags

Read MoreRead Less
Next Story