తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పెన్షన్.. సీఎం చంద్రబాబు ఆదేశం

X
By - Prasanna |12 Dec 2024 4:00 PM IST
మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
మానవతా దృక్పథంతో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రెండో రోజు చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనాథ పిల్లలను గుర్తించి వారికి నెలనెలా పింఛన్లు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పిల్లలను గుర్తించే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఏటా అనాథ పిల్లల జాబితాను అప్డేట్ చేయాలని కూడా ఆయన సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com